ఉద్యోగుల్లో నిబద్ధత ఎంతో ముఖ్యం : గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ రాజకుమారి

ఉద్యోగుల్లో నిబద్ధత ఎంతో ముఖ్యం : గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ రాజకుమారి

పద్మారావునగర్​, వెలుగు: ఉద్యోగులు  నిబద్ధతతో వ్యవహరించాలని  గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్​ రాజకుమారి అన్నారు. అంకితభావంతో చేసే పనులు తమకు గుర్తింపునిస్తాయన్నారు.  టీఎన్​జీవో మెడికల్​, హెల్త్ సెంట్రల్​ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 ప్రత్యేక డైరీ, క్యాలెండర్​ లను అద్యక్ష, కార్యదర్శులు ఈ.కిరణ్​ రెడ్డి, ఎం.సత్యనారాయణ రెడ్డి  శుక్రవారం  ఆమెకు అందచేశారు.

టీఎన్​జీవో మెడికల్​,హెల్త్​ సెంట్రల్​ ఫోరం ఆధ్వర్యంలో సూపరింటెండెంట్​ ను శాలువాతో సత్కరించారు. ప్రజలకు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది బాధ్యతాయుతంగా మరింత మెరుగ్గా వైద్య సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్​జీవో యూనియన్​ నాయకులు పేర్కొన్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్​ ప్లోరెన్స్​ మెర్లిన్​, డిప్యూటీ సూపరింటెండెంట్​ డాక్టర్​ సునీల్​, గాంధీ టీఎన్​జీవో యూనిట్​ అద్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్​, ప్రసన్నానంద్​, యూనియన్​ నాయకులు జనార్థన్​, శ్రవణ్​ కుమార్​, సరళ, సత్యనారాయణ, కలీమ్, విజయలక్ష్మీ, భావన, శ్రీనివాస్ పాల్గొన్నారు.