రావణాసురవధ ఉత్సవ కమిటీ ఎన్నిక : గండ్రకోట కుమార్

రావణాసురవధ ఉత్సవ కమిటీ ఎన్నిక : గండ్రకోట కుమార్

ములుగు, వెలుగు: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే రావణాసురవధ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా గండ్రకోట కుమార్ నియామకమయ్యారు. బుధవారం ములుగులోని బొడ్రాయి వద్ద జరిగిన ధర్మజాగరణ ఉత్సవ సమితి సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విజయదశమి రోజున 20 ఏండ్లుగా రావణాసురవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరిగే ఉత్సవానికి వేలాదిమంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులుగా ఓడ రాజు గౌడ్, రాసమల్ల శివాజీ, గుండెబోయిన రమేశ్, గాదం దేవేందర్, అనుముల సురేశ్, ఎల్కతుర్తి శ్రీహరి, ఒజ్జల లింగన్న, ప్రధాన కార్యదర్శులుగా నూనె శ్రీనాథ్, సింగరవేణి వెంకటయ్య యాదవ్, గండ్రత్ ప్రవీణ్, సహాయ కార్యదర్శులుగా రాయించు నాగరాజు, బైకాని రాజశేఖర్, కన్వీనర్ గా కుమార్ పాడ్య, కోశాధికారిగా మాదరి జనార్దన్, సహ కోశాధికారిగా పాడ్య చంటి, ప్రచార కార్యదర్శులుగా భూమ నరేశ్, మేడుదుల మమన్ యాదవ్, కార్యవర్గ సభ్యులుగా తమ్మిశెట్టి అరుణ్, జర్పుల పవన్, పోరిక సాయిరామ్ నాయక్, వల్లపు అర్జున్, మీడియా ఇన్​చార్జిలుగా సంగ రంజిత్, గుగ్గిళ్ల సుజన్ తదితరులను ఎన్నుకున్నారు.