
ఖమ్మం: ఏపీ, తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులో పలు ఇండ్లలో చోరీలకు పాల్పడుతూ ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఘరానా దొంగల ముఠాను ఇవాళ వైరా పోలీసులు అరెస్ట్చేశారు. సర్వే పేరుతో ఇంట్లోని చొరబడి వృద్దురాలి వద్ద బీరువాలోని నగలు, క్యాష్ ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మంలో సంచలనం సృష్టించింది.
ఈ కేసు వైరా పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన్నట్లు తెలిపారు. వీరి నుంచి 35 లక్షల విలువైన సొమ్మును రికవరీ చేసిన్నట్లు పోలీసులు చెప్పారు. ఖమ్మం సీపీ సునీల్దత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. వైరా లీలా సుందరయ్య నగర్లో ఓ వృద్దురాలి ఇంట్లోకి పోలీసు యూనిఫార్మ్లో వచ్చి మీ కొడుకు గంజాయి అమ్ముతున్నాడని ఇంట్లో సోదాలు చేయాలని నలుగురు దొంగల ముఠా ప్రవేశించిందన్నారు.
సర్వే పేరుతో వృద్దురాలి ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగలు, క్యాష్దొంగిలించిన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా వైరా పోలీసులు ఇంటర్స్టేట్బోర్డర్లో వెహికల్చెకింగ్చేస్తుండగా నలుగురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకోని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చిందన్నారు. వీరి నుంచి రూ. 35 లక్షల క్యాష్, రెండు కార్లు, బంగారం, కత్తులు, మారణాయుధాలు, నకలీ పోలీసు యానిఫార్మ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.