విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ యాప్ ముఠా : 800 బ్యాంక్ అకౌంట్స్ తో.. చైనాతో లావాదేవీలు

విశాఖలో అంతర్జాతీయ బెట్టింగ్ యాప్ ముఠా : 800 బ్యాంక్ అకౌంట్స్ తో.. చైనాతో లావాదేవీలు

బెట్టింగా ముఠాలు రెచ్చిపోతున్నాయి . చైనాతో సంబంధాలు పెట్టుకుని  విశాఖ కేంద్రంగా భారీ ఎత్తున బెట్టింగ్ యాప్ దందా నడిపిస్తున్నాయి. 800 బ్యాంక్ అకౌంట్స్ తో చైనాతో లావాదేవీలు జరుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వందల సంఖ్యలో డెబిట్ కార్డులు, బ్యాంకు చెక్ బుక్ లు స్వాధీనం చేసుకున్నారు. 10 ల్యాప్ టాప్ లు, 8 డెస్క్ టాప్ లు, ఓ కారు, బైకు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు  వెల్లడించారు.  ఈ ముఠా విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్ సాయంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. ఈ వ్యవహారంలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు  డెబిట్ కార్డులు... ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.   అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విచారణ జరిపామని తెలిపారు. 

సైబర్ నేరస్తులకు చైనాతో  సంబంధాలున్నాయని, రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్ లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఆర్బీఐ అనుమతి లేకుండానే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారని, బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్ దేశాలకు పంపిస్తున్నారని సీపీ తెలిపారు. దాదాపు 800 ఖాతాలతో వీరు లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.