
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్లో గ్యాంగ్వార్నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. హంతకులను పోలీసులు ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. డీఎస్పీ ఎల్ జీవన్రెడ్డి టూటౌన్ పోలీస్స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్రాంతినగర్కు చెందిన కొమ్మవార్రవితేజ(26) ను మహాలక్ష్మివాడకు చెందిన గోవింద్కార్తీక్అలియాస్ గోల్డెన్కార్తీక్, ఇంద్రానగర్కు చెందిన చెల్కల ప్రణీత్, దేవుల సాయికిరణ్హత్య చేశారు. నిందితులు ముఠాగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, కొంత కాలంగా రవితేజను తమ గ్యాంగ్లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారు.
మృతుడు వేరే వారితో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేక, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రవితేజ ఇంటికి వెళ్తుండగా అడ్డగించి గొడవకు దిగారు. రవితేజను ప్రణీత్, సాయికిరణ్పట్టుకోగా గోల్డెన్కార్తీక్కత్తితో మెడపై 7 సార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం నిందితులు పరారయ్యారు.
నిందితుల నుంచి బటన్చాక్, మూడు సెల్ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి భార్య ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఐ కరుణాకర్రావు, ఎస్సై విష్ణు ప్రకాశ్, వన్టౌన్ సీఐ సునీల్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, జైనథ్సీఐ సాయినాథ్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.