
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి రెండు గ్యాంగ్లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే, ఆవేశం తగ్గించుకోని రెండు గ్యాంగ్ల సభ్యులు అక్కడ కూడా కత్తులతో పొడుచుకోబోయారు. నగరంలోని డైరీ ఫాం ఏరియాకు చెందిన మహ్మద్ అద్నాన్ నలుగురు ఫ్రెండ్స్తో కలిసి రాత్రి ధర్మపురి హిల్స్ వెళ్లాడు. అక్కడికి సమీర్, రెహాన్ స్నేహితుల గ్రూప్ రాగా అడ్డుకున్నారు. రౌడీయిజం చెలాయించే ఈ రెండు గ్రూప్ల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ సందర్భంగా రెండు గ్రూప్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకోగా మహ్మద్ అద్నాన్ చేయి కట్అయింది. సమీర్, రెహాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని జీజీహెచ్ హాస్పిటల్లో చేర్పించగా, ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు హాస్పిటల్లో కూడా కత్తులతో పొడుచుకోబోయారు. వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అల్లరిమూకలను స్టేషన్కు తరలించారు.