
జగిత్యాల జిల్లాలో వింత చోటు చేసుకుంది. కోరుట్లలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భీమునిదిబ్బ ఏరియాలో భీమసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక పూజలు జరుగుచున్నాయి. ప్రతి రోజు భక్తులు ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే నిలపడిన వినాయకుడు ఆకారంలో ఉన్న విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఈ విగ్రహం చేతిపూ గరుడపక్షి వాలింది. గణపతి ముందు ఉన్న అక్షింతలు తిన్నది. ఇదంతా స్వామి మహిమే అని భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.