న్యూయార్క్​... పారిస్​ సిటీలతో హైదరాబాద్​ పోటీపడాలి

న్యూయార్క్​... పారిస్​ సిటీలతో హైదరాబాద్​ పోటీపడాలి

గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్​బీ​ సమ్మిట్​ లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొన్నారు.  ఐఎస్​బీ విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలన్నారు.  ఐఎస్​బీ స్టూడెంట్స్​కు  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందంటూ.. న్యూయార్క్​... పారిస్​ సిటీలతో హైదరాబాద్​ పోటీపడాలన్నారు. ఐఎస్ బీ​ లీడర్​ షిప్​లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్న సీఎం .. గొప్ప లీడర్​ కావాలంటే ప్రజలతో మమేకం అవ్వాల్సిందే నన్నారు,  తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

 సౌత్​ కొరియా సహకారంతో యంగ్​ ఇండియా స్పోర్ట్​ యూనివర్శిటీని నిర్మించామన్నారు.  ధనక, పేద అనే తేడా లేకుండా అందరికి అవకాశం ఇవ్వాలన్నారు.  పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇచ్చినంత జీతం ఇవ్వకున్నా.. అంతకు మించి అవకాశాలను కల్పిస్తామన్నారు.  - స్కిల్ యూనివర్సిటీ తో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ ని కూడా నిర్మిస్తామన్నారు. - ఒలంపిక్స్ లో భారత్ కి అత్యధికంగా మెడల్స్ అందించే వాళ్ళు మన హైదరాబాద్ నుంచే ఉండాలన్నదే తన  లక్ష్యమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.