
ములుగు, వెలుగు : ములుగు సమీపంలోని గట్టమ్మ ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. దేవాదాయశాఖ అధికారి డి.అనిల్కుమార్, ఆదివాసీ నాయకపోడ్ పూజారుల సమక్షంలో మధ్యాహ్నం 2 గంటలకు హుండీ లెక్కింపు స్టార్ట్ చేశారు. మొత్తం రూ.42,225లు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. కార్యక్రమంలో గట్టమ్మ ఆలయ ఈవో బి.శ్రీనివాస్, ఆదివాసీ నాయకపోడ్ గట్టమ్మ పూజారులు కొత్త సదయ్య, లక్ష్మయ్య, సురేందర్, రవి, చిర్ర సుభద్ర, ఆకుల లక్ష్మ, అచ్చ రాజు పాల్గొన్నారు.