
చైతన్య మహాప్రభు అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో గౌర పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తయారు చేసిన 56 రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకు ముందు కలశ మహాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హరేకృష్ణ కీర్తనల మధ్య మహాపల్లకీ ఉత్సవం వైభవంగా సాగింది. – వెలుగు, జూబ్లీహిల్స్