స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ రూ.100 కోట్లు విరాళం

స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ రూ.100 కోట్లు విరాళం

అదానీ గ్రూప్ కంపెనీ చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం ( అక్టోబర్ 18)  సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయాల విరాళం అందించారు. సీఎంను కలిసి  అదానీ ఫౌండేషన్ తరఫున విరాళం మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు  గౌతమ్ అదానీ. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. యువతలో నైపుణ్యం పెంచేలా రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. 

ALSO READ | విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే

ఈ స్కిల్ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణను ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ప్రతి ఏడాది లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రానున్న కాలంలో ఈ యూనివర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.