గ్రౌండ్‌‌‌‌లోకి గంభీర్‌‌‌‌‌‌‌‌

గ్రౌండ్‌‌‌‌లోకి గంభీర్‌‌‌‌‌‌‌‌

పల్లెకెలె(శ్రీలంక):  టీమిండియా హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌గా బాధ్యతలు చేపట్ట గౌతమ్ గంభీర్‌‌‌‌‌‌‌‌  గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చి కోచింగ్‌‌‌‌ మొదలు పెట్టాడు.  శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరిగే మూడు టీ20 సిరీస్‌‌‌‌ కోసం ఇండియా గంభీర్‌‌‌‌‌‌‌‌ గైడెన్స్‌‌‌‌లో మంగళవారం తొలి ప్రాక్టీస్‌‌‌‌ సెషన్‌‌‌‌లో పాల్గొన్నది.

ALSO READ : స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 3,442 కోట్లు

  రాహుల్ ద్రవిడ్ స్థానంలో కోచింగ్ పగ్గాలు అందుకున్న గౌతీ గ్రౌండ్‌‌‌‌లోకి వచ్చి ఫీల్డింగ్‌‌‌‌ డ్రిల్స్‌‌‌‌తో కూడిన  సెషన్‌‌‌‌ను పర్యవేక్షించాడు. ఈ సెషన్‌‌‌‌లో ప్లేయర్లు ఎక్కువగా రన్నింగ్‌‌‌‌, క్యాచింగ్‌‌‌‌ ప్రాక్టీస్ చేయగా... గౌతీ ఒక్కో ఆటగాడితో మాట్లాడాడు. ప్రాక్టీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో సంజూ శాంసన్‌‌‌‌కు బ్యాటింగ్‌‌‌‌ టిప్స్ చెబుతూ కనిపించాడు. కొత్త కెప్టెన్ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ కూడా ప్లేయర్లతో మాట్లాడాడు.