వచ్చే 12 నెలల్లో జీసీసీల్లో పెరగనున్న జీతాలు

వచ్చే 12 నెలల్లో జీసీసీల్లో పెరగనున్న జీతాలు

న్యూఢిల్లీ: మనదేశంలోని గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీలు) జీతాలు రాబోయే 12 నెలల్లో  9.8 శాతం వరకు పెరుగుతాయని ​ఎన్​ఎల్​బీ సర్వీసెస్ ​రిపోర్ట్​ తెలిపింది.  గ్లోబల్‌‌గా ఉన్న మొత్తం జీసీసీల్లో 55 శాతం ఇండియాలో ఉన్నాయి. హైదరాబాద్​, ముంబైలోని జీసీసీలు ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి. ఐటీ సాఫ్ట్​వేర్​, కన్సల్టింగ్​, బ్యాంకింగ్​ నిపుణులకు భారీ డిమాండ్​ ఉంది. 2030 నాటికి వీటి మార్కెట్​ సైజు 110 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుంది. 

 వీటిలో మహిళల ఉద్యోగుల జీతాలు పురుషులతో పోలిస్తే 15 శాతం వరకు తక్కువ ఉన్నాయని,  ఈ తేడాలు తొలగిపోవాలని ఎన్​ఎల్బీ సీఈఓ సచిన్​ అలుగ్​ అన్నారు.  మల్టీ నేషనల్ ​కంపెనీలు తక్కువ ఖర్చుతో తమ కార్యకలాపాలను నిర్వహించడానికి విదేశాలలో ఏర్పాటు చేసే ప్రత్యేక వ్యాపార యూనిట్లను జీసీసీలు అంటారు.