గీతంలో మార్చి 27న టెడ్​ఎక్స్​ ఈవెంట్

గీతంలో మార్చి 27న టెడ్​ఎక్స్​ ఈవెంట్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు:  పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ వర్సిటీలో ఈ నెల 27న టెడ్​ఎక్స్​ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్​ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు పాల్గొని తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకోనున్నట్లు గీతం ప్రతినిధులు తెలిపారు.

ఈ టెడ్ఎక్స్​ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, న్యూస్​ మొబైల్​ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్​ చీఫ్ సౌరబ్​ శుక్లా, ప్రముఖ జర్నలిస్ట్​ అటికా అహ్మద్​ ఫరూకీ, ప్రఖ్యాత ఆర్థికవేత్త, 13వ ఫైనాన్స్​ కమిషన్​అడ్వైజర్​ రథిన్​రాయ్​, ది లెర్నింగ్ కర్వ్​ సీఈవో సుబ్బూ పరమేశ్వరన్​ విద్య పాల్గొంటారని వివరించారు. సినిమా, జర్నలిజం, పాలిటిక్స్​, స్పోర్ట్స్​, డిజిటల్ అంశాలతో ఆకర్షనీయమైన సంభాషణలు, భవిష్యత్​ ఆలోచనలకు గీతం టెడ్ఎక్స్​ వేదిక కానుందని, స్టూడెంట్స్​కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.