
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: విద్యా సహకారం, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల కోసం బెంగళూరులోని పైటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్తో గీతం యూనివర్సిటీ మంగళవారం ఎంవోయూ చేసుకుంది. ఈ మేరకు పటాన్చెరు పరిధిలోని వర్సిటీ క్యాంపస్లో గీతం వీసీ డీఎస్రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీఆర్శాస్త్రి, పైటెక్ డైరెక్టర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ చీఫ్ మురుగన్ రంగనాథన్ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.
అనంతరం ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఇండస్ర్టీ 4.0 పై స్టూడెంట్ వర్క్షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంబెడెడ్ ప్రతినిధులు మాట్లాడుతూ టెక్నాలజీ డెవలప్మెంట్ను పెంచి ఫ్యూచర్ ఇంజినీర్లను ప్రోత్సహించడానికి గీతంతో చేసుకున్న ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. విద్యార్ధులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్టూడెంట్స్ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు.