
న్యూఢిల్లీ: జెన్సోల్ ఇంజనీరింగ్ ప్రమోటర్లు - అన్మోల్ సింగ్ జగ్గీ , పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించడంతో కంపెనీ షేర్లు గురువారం 5 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకాయి. - నిధుల మళ్లింపు, పాలనాపరమైన లోపాల కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. అంతేగాక కంపెనీ ఇండిపెండెంట్డైరెక్టర్ అరుణ్ మీనన్ గురువారం రాజీనామా చేశారు.
స్టాక్ 4.97 శాతం పడిపోయి రూ.117.50కి చేరింది ఎన్ఎస్ఈ లో ఇది 5 శాతం క్షీణించి రూ.116.54కి చేరుకుంది .- ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. బుధవారం కూడా జెన్సోల్ ఇంజనీరింగ్ షేర్లు 5 శాతం తగ్గి లోయర్ సర్క్యూట్ పరిమితిని తాకాయి. 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,125.75 నుంచి ఈ స్టాక్ ఇప్పుడు 89.56 శాతం తగ్గింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అన్మోల్ పునీత్ సింగ్ జగ్గీలు జెన్సోల్లో డైరెక్టర్ లేదా కీలక పదవుల్లో ఉండకుండా సెబీ నిషేధం విధించింది.
జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (జీఈఎల్) ప్రకటించిన స్టాక్ విభజనను నిలిపివేయాలని ఆదేశించింది. కంపెనీ నిధులను అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గి సొంతానికి వాడుకున్నారని సెబీ స్పష్టం చేసింది.