
- జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం యూనివర్శిటీ ప్రారంభించిన కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో సదుపాయాలు బాగున్నాయని జర్మనీ రాయబారి డాక్టర్ ఫిలిప్ అకెర్మాన్ అన్నారు. బుధవారం కౌటిల్య స్టూడెంట్లతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడి విద్యావిధానం, వనరులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయన్నారు.
జర్మనీకి భారత్ వాణిజ్య, వ్యాపార భాగస్వామిగా ఉందని, భారత్, యూరోపియన్ యూనియన్ల మధ్య ఒప్పందాలు మెరుగుపడటం శుభ సూచకమన్నారు. భారత్ నుంచి జర్మనీకి వచ్చే విద్యార్ధుల సంఖ్య పెరుగుతోందని, ఇక్కడి విద్యార్ధులు అంకితభావంతో పని చేస్తారని అన్నారు. గీతం కౌటిల్యతో భవిష్యత్లోనూ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామన్నారు.