మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

మాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి

హనుమకొండ : స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని శనివారం ఓ మహిళ మృతి చెందింది. కాజీపేట మండలం మడికొండ దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో కలకోట్ల స్వప్న(40) అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది.

శనివారం రాత్రి మహిళ రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్ వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. యాక్సిడెంట్ అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారు కాజీపేట బాపూజీనగర్ లో వదిలివెళ్లిపోయిన వెళ్లిపోయారు.