హైదరాబాద్‎లో GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‎లో GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇవాళ (2024, అక్టోబర్ 8) చార్మినార్ జోన్‎లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్ ఆలం ట్యాంక్, బహదూర్ పుర తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని అధికారులను ఆదేశించిన కమిషనర్.. స్వచ్ఛ ఆటోల మూమెంట్, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా పర్యవేక్షించాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్‏లను తొలగించాలని చెప్పారు. రోడ్ల పై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఆమ్రపాలి. 

ALSO READ | సీసీ రోడ్డు పనుల్లో అవకతవకలను ప్రశ్నించిన ఫిరోజ్ ఖాన్.. దాడికి దిగిన ఎంఐఎం ఎమ్మెల్యే..