కూకట్‌పల్లి జోన్‌లో చెరువులను పరిశీలించిన GHMC కమిషనర్ ఆమ్రపాలి

కూకట్‌పల్లి జోన్‌లో చెరువులను పరిశీలించిన GHMC కమిషనర్ ఆమ్రపాలి

హైదరాబాద్: GHMC కమిషనర్ ఆమ్రపాలి కూకట్ పల్లి జోన్ పరిధిలోని చెరువులను మంగళవారం పరిశీలించారు. Idl చెరువు, సర్దార్ నగర్ వరద ముంపు గురైన ప్రాంతంలో ఆమె పర్యటించారు. ప్రజలతో మాట్లాడిన వారి సమస్యలను తెలుసుకున్నారు. ముంపు గురైన కాలని వాసులకు సురక్షిత త్రాగు నీరు సరఫరా చేయాలని, దోమల నివారణకు ఏ ఎల్ ఓ,  ఫాగింగ్ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన కమిషనర్ ఆమ్రపాలి కాట. 

గణపతి నవరాత్రుల సందర్భంగా.. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారామె. నిమజ్జనానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.