ఈవీ చార్జింగ్ స్టేషనా .. చెత్త డంపింగ్​​ పాయింటా?

ఈవీ చార్జింగ్ స్టేషనా .. చెత్త డంపింగ్​​ పాయింటా?

చాదర్​ఘాట్ ఇసామియా బజార్​లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్​వెహికల్స్​ చార్జింగ్​పాయింట్ ఇది. నిర్వహణ లేక చార్జింగ్​ మెషీన్​పనిచేయడం లేదు. చార్జింగ్​ గన్స్ ​చోరీకి గురయ్యాయి. వాడకం లేకపోవడంతో స్థానికులు రోజూ చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు తెచ్చిపోస్తున్నారు. దీంతో గార్బేజ్ ​వల్నరబుల్ పాయింట్​లా మారింది. చెత్త వేయకుండా చూడకపోగా, ఈవీ చార్జింగ్ మెషీన్ మెయింటెనెన్స్​ను బల్దియా అధికారులు గాలికొదిలేశారు.