ట్యాక్స్​ బకాయిలు: జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ రూ.52 కోట్లు..హైద్రాబాద్ ఆస్బెస్టాస్ రూ.30 కోట్లు

 ట్యాక్స్​ బకాయిలు:  జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్  రూ.52 కోట్లు..హైద్రాబాద్ ఆస్బెస్టాస్ రూ.30 కోట్లు

జీహెచ్​ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుల వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు.    ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి జీహెచ్ఎంసీ అధికారులు   నోటీసులు జారీ చేస్తున్నారు.  ప్రాపర్టీ ట్యాక్స్​ బకాయిల వసూళ్ల కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో వందమందికి రెడ్ నోటీసులు జారీ చేశారు.  నోటీసులకు స్పందించని వారి ఆస్తులను సీజ్​ చేస్తున్నారు. రూ. 5 లక్షలకు పైన ఉన్న బకాయిల విలువ రూ 860 కోట్లు ఉన్నాయని అధికారులు తేల్చారు. 

బకాయిల వివరాలు

  • జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ :  రూ.52 కోట్లు
  • హైద్రాబాద్ ఆస్బెస్టాస్ సంస్థ : రూ.30 కోట్లు
  • ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ : రూ. 5 కోట్ల 50 లక్షలు
  • సోమాజిగూడ లోని కత్రియా హోటల్:రూ. 8 కోట్ల 62 లక్షలు
  • ఎల్ అండ్ టీ మెట్రో రైల్: రూ.32 కోట్లు
  • ఇండో అరబ్ లీగ్ :  రూ.7 కోట్ల 33 లక్షలు