
- నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న వాటర్బోర్డు
- ఇప్పటివరకు 17 వేల మందికి నోటీసులు
- వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్పరిధిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోని వారందరికీ వేసవిలో ట్యాంకర్లు బుక్చేసుకుంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వాటర్బోర్డు ఈ ఏడాదికి ఉపసంహరించుకుంది. గత సంవత్సరం కొన్ని ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో వాటర్ట్యాంకర్లు బుక్కావడంపై ఆరా తీసిన వాటర్బోర్డు సర్వే చేసింది. ఇంకుడు గుంతలు నిర్మించుకోని కారణంగానే బోర్లు ఎండిపోయి అధికంగాట్యాంకర్లు బుక్చేసుకుంటున్నట్టు గుర్తించింది.
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచనలు చేసింది. నిర్మించుకోని వారు ట్యాంకర్లు బుక్చేస్తే డబుల్ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. గత ఏడాది లెక్కనే ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి భారీగా ట్యాంకర్లు బుక్అవుతున్నట్టు తెలుసుకుని రెట్టింపు ఛార్జీలు వసూలుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే, సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం, ఈ ఏడాదే నిర్మించుకున్న ఇంకుడు గుంతలతో ప్రయోజనం ఉండే అవకాశం లేకపోవడంతో వచ్చే ఏడాది వేసవిలో ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్అయ్యింది. దీంతో ఈసారి ట్యాంకర్బుక్చేస్తే అందరి లెక్కనే ఛార్జీలు వసూలు చేయనున్నది.
వెస్ట్ సిటీలోనే ఎక్కువ ..
గ్రేటర్ పరిధిలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, మియాపూర్, ఎస్ఆర్నగర్, కుత్బుల్లాపూర్, హైటెక్సిటీ, ఐటీ కారిడార్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బోర్లు ఎండిపోయాయి. భారీ సంఖ్యలో ట్యాంకర్లను బుక్చేస్తున్న వారి వివరాలు సేకరించగా వెస్ట్సిటీ నుంచే దాదాపు 42 వేల మంది 90 శాతం బుక్చేస్తున్నట్టు తేలింది. వీరి ఇండ్లకు వెళ్లి తనిఖీలు చేసి ఇంకుడు గుంతలు లేని 17వేల మందికి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా కౌన్సిలింగ్కూడా ఇవ్వగా ఐదువేల మంది నిర్మించుకున్నారు.
నిర్మించుకోని వారిపై ఒత్తిడి తేవడంలో భాగంగా వాటర్ట్యాంకర్బుక్చేస్తే డబుల్ఛార్జీ వసూలు చేస్తామని వార్నింగ్ఇచ్చింది. ఇప్పుడు నిర్మించిన ఇంకుడు గుంతలు ఏ విధంగా పని చేస్తున్నాయన్నది వచ్చే వర్షాకాలంలో తెలుస్తుంది కాబట్టి ఈ ఏడాది ట్యాంకర్ల బుకింగ్లపై అదనపు ఛార్జీల వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన లేదని సమాచారం.