
ప్రపంచంలో జనాలు వింత వింత వంటకాలను తింటారు. సాధారణంగా జనాలు చికెన్, మటన్ లాంటి వాటితో వెరైటీ ఫుడ్స్ తయారు చేసుకుంటారు. కొంతమంది ఉసుళ్లను ( లైట్ల దగ్గర ఉండే పురుగులు) చట్నీ చేసుకొని లాగించేస్తారు. అలాగే వాటిని ఉల్లిపాయి పకోడీ మాదిరిగా తినేస్తారు. కాని చైనీస్ ప్రజలు మాత్రం ఏ జీవి కనపడినా టేస్ట్ చూడకుండా వదలిపెట్టరు. పాములు, తేళ్లు, జెర్రులు, ఎలుకలు ఇలా ఏవి పడితే అవి తింటారు. అయితే ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో చూసే ముందు కాస్త ఆలోచించి చూడండి. ఎందుకంటే ఇది చూస్తే కడుపులో తిప్పుతుంది.
ALSO READ :పాకిస్థాన్ లో మగాళ్లు వేస్ట్.. ఆడోళ్లకే కుటుంబాలపై బాధ్యత : కొత్త కామెంట్లపై రచ్చ రచ్చ
వాస్తవానికి ఈ వీడియోలో ఒక అమ్మాయి బొద్దింకను.. అది కూడా టమోటా-మిరపకాయ చట్నీతో తింటోంది. సాధారణంగా టొమాటో-మిరపకాయ చట్నీతో మోమోస్ తింటారు. అయితే ఇక్కడ ఆ అమ్మాయి ఈ చట్నీతో బొద్దింకలను తింటుంది. ఆ అమ్మాయి మొదట చాలా బొద్దింకలను నూనెలో వేయించి, ఆపై ప్లేట్లో వడ్డించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ ప్లేటులో టమాటా-మిరపకాయ చట్నీ కూడా ఉంది. అప్పుడు ఆమె రెండు మూడు బొద్దింకలను ఎంచుకొని ఎర్ర చట్నీలో బాగా ముంచి వాటిని ఎంతో ఇష్టంగా తింది. అయితే ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా వాంతి వచ్చేలా ఉంది.
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫేవరైట్విల్డ్ అనే IDతో షేర్ చేయబడింది. ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అయితే 4 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు భిన్నమైన కామెంట్స్ చేశారు. ‘చైనీస్ ప్రజలు ఎప్పుడూ ఆకలితో ఉండరు.. ఎందుకంటే వారు ఏదైనా తింటారు’ అని ఒకరు సరదాగా రాయగా, మరొకరు ‘నా ఇంట్లో బొద్దింకలు చాలా ఉన్నాయి. వాటిని కూడా తీసుకొని వేయించుకుని తినండి’ అని రాశారు. ‘ఈ క్లిప్ ఫేక్. వారు ఇలాంటి మురికి కీటకాలను తినరని కామెంట్ చేశారు.