ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలదే హవా
  • ఉమ్మడి జిల్లాలో ఫస్ట్, సెకండ్​ ఇయర్​లో పాలమూరు టాప్ 
  • ఒకేషనల్ లో​మొదటి స్థానంలో నిలిచిన నారాయణపేట

మహబూబ్​నగర్, వెలుగు: ఇంటర్​ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఫస్ట్, సెకండ్​ ఇయర్​తో పాటు ఒకేషనల్​ విభాగాల్లో బాయ్స్​ కంటే బాలికలే ఎక్కువ మంది పాస్​ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్  ఫస్ట్, సెకండ్​ ఇయర్​లో పాలమూరు మొదటి స్థానంలో నిలువగా.. ఒకేషనల్​ విభాగంలో ఫస్ట్, సెకండ్​ ఇయర్​లో నారాయణపేట జిల్లా ఫస్ట్​ ప్లేస్​లో నిలిచింది. 

ఫస్ట్​ ఇయర్  ఫలితాలు ఇలా..

గద్వాలలో రెగ్యులర్​ ఫస్ట్​ ఇయర్​లో 3,260 మంది పరీక్షలకు అటెండ్​ కాగా, 57.18 శాతంతో 1,864 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 1,465 మందికి గాను 645, బాలికలు 1,795కి గాను 1,219 మంది పాస్​ అయ్యారు. మహబూబ్​నగర్​లో 8,917 మందికి గాను 62.78 శాతంతో 5,598 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 4,030కి గాను 2,110 మంది, బాలికలు 4,887కి గాను 3,488 మంది పాస్​ అయ్యారు. నాగర్​కర్నూల్​లో 4,899 మంది పరీక్షలకు అటెండ్​ కాగా 47.79 శాతంతో 2,341 మంది ఉత్తీర్ణత సాధించారు. 

వీరిలో బాయ్స్​ 1,936కి గాను 567, బాలికలు 2,963కి గాను 1,774 మంది ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేటలో 3,726 మంది అటెండ్​ కాగా 54.40 శాతంతో 2,027 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ విభాగంలో 1,567కి గాను 602 మంది, బాలికల విభాగంలో 2,159కి గాను 1,425 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 5,293 మందికి గాను 58.62 శాతంతో 3,103 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 2,578 మందికి గాను 1,229, బాలికలు 2,715 మందికి గాను 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇంటర్​ సెకండ్​ ఇయర్​లో..

ఇంటర్​ సెకండ్​​ ఇయర్​ రిజల్ట్స్​లో గద్వాలలో 2,963 మందికి గాను 68.07 శాతంతో 2,017 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 1,331 మందికి గాను 756 మంది, బాలికలు 1,632 మందికి 1,261 మంది పాస్​ అయ్యారు. మహబూబ్​నగర్​లో 8,225 మంది పరీక్షలు రాయగా 69.59 శాతంతో 5,724 మంది పాస్​ అయ్యారు. నాగర్​కర్నూల్​లో 4,629 మందికి గాను 62.82 శాతంతో 2,908 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 1,742 మందికి గాను 817, బాలికలు 2,887కు గాను 2,091 మంది పాస్​ అయ్యారు. నారాయణపేటలో 3,203 మంది పరీక్షలు రాయగా 67.03 శాతంతో 2,147 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​1,298కి 705 మంది, బాలికలు 1,905 మందికి 1,442 మంది పాస్​ అయ్యారు. వనపర్తిలో 4,748 మందికి గాను 67.35 శాతంతో 3,198 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 2,236 మందికి 1,303, బాలికలు 2,515కు గాను 1,895 మంది పాస్​ అయ్యారు.

ఒకేషనల్​ ఫస్ట్​ ఇయర్​లో..

ఒకేషనల్​​ఫస్ట్​ ఇయర్ లో గద్వాలలో  794 మందికి గాను 67.76 శాతంతో 538 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 372 మందికి 178 మంది, బాలికలు 422 మందికి 360 మంది పాస్​ అయ్యారు. మహబూబ్​నగర్​లో  2,006 మంది పరీక్షలకు అటెండ్​ కాగా 70.74 శాతంతో 1,419 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 871 మందికి గాను 465, బాలికలు 1,135 మందికి 954 మంది ఉత్తీర్ణత సాధించారు. నాగర్​కర్నూల్​లో 1,578 మందికి గాను 51.84 శాతంతో 818 మంది పాస్​ అయ్యారు. 

వీరిలో బాయ్స్​ 881 మందికి గాను 303, బాలికలు 697 మందికి గాను 515 మంది పాస్​ అయ్యారు.  నారాయణపేటలో 573 మందికి గాను 80.45 శాతంతో 461 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 150 మందికి గాను 87 మంది, బాలికలు 423కి గాను 374 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 1,163 మందికి గాను 61.65 శాతంతో 717 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 516 మందికి 210 మంది, బాలికలు 647కి గాను 507 మంది ఉత్తీర్ణత సాధించారు. 

ఒకేషనల్​ సెకండ్​ ఇయర్​లో..

ఒకేషనల్​ సెకండ్​ ఇయర్​ రెగ్యులర్​ విభాగంలో గద్వాలలో 653 మందికి 69.53 శాతంతో 454 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 278 మందికి 131, బాలికలు 375కి 323 మంది ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్​నగర్​లో 1,721 మందికి గాను 79.72 శాతంతో 1,372 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 681కి 454, బాలికలు 1,040కి 918 మంది పాస్​ అయ్యారు. నాగర్​కర్నూల్​లో 1,270 మందికి గాను 67.95 శాతంతో 863 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 641కి గాను 335, బాలికలు 629కు 528 మంది ఉత్తీర్ణత సాధించారు. నారాయణపేటలో 536 మందికి గాను 84.51 శాతంతో 453 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 159కి 106 మంది, బాలికలు 377కు 347 మంది ఉత్తీర్ణత సాధించారు. వనపర్తిలో 946 మందికి గాను 64.59 శాతంతో 611 మంది పాస్​ అయ్యారు. వీరిలో బాయ్స్​ 393కి 164 మంది, బాలికలు 553కి 447 మంది పాస్​ అయ్యారు.