
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్వర్సిటీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్యఒక ఒప్పందం కుదిరింది. ఎయిర్ఫోర్స్సిబ్బంది పిల్లలకు రాయితీ సీట్లు, గీతం చేపట్టే పరిశోధనలకు ఐఏఎఫ్ సహకారంపై గురువారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్మార్షల్రాజీవ్శర్మ, గీతం వైస్ఛాన్స్లర్ ప్రొఫెసర్డీఎస్ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఐఏఎఫ్ సిబ్బంది, వితంతువుల పిల్లలకు నీట్ యూజీ ప్రవేశాల్లో రాయితీ సీట్లు, అర్హత గల స్టూడెంట్స్కు ఇంజినీరింగ్ ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఐదేళ్ల పాటు అమలులో ఉండే ఈ ఒప్పందం ప్రకారం స్టూడెంట్స్ప్రతిభ ఆధారంగా 50 శాతం వరకు ట్యూషన్ ఫీజులో రాయితీ దక్కుతుందని తెలిపారు. గీతం అందించే స్కాలర్షిప్లకు అప్లై చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. గీతం వర్సిటీ యాజమాన్యం అందిస్తున్న ఈ సహకారానికి ఐఏఎఫ్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎయిర్ఫోర్స్కమాండర్పంకజ్జైన్, గ్రూప్ కెప్టెన్రచనా జోషి, గీతం కోర్ఇంజినీరింగ్ డీన్ ప్రొఫెసర్వీఆర్శాస్ర్తీ, సివిల్ ఇంజినీరింగ్ హెడ్ అఖిలేష్ పాల్గొన్నారు.