
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025 ఎనిమిదో ఎడిషన్ ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది.
థీమ్: ఇండియా యాజ్ఏ టాప్ ఏరోస్పేస్ సప్లయ్ చైన్
ఐటీ, పునరుత్పాదక ఇంధనం, పారిశ్రామికరంగం, పర్యాటకం, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, వ్యవసాయం, ట్రాన్స్ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పెట్టుబడులు అధికంగా తీసుకురావాలని నిర్ణయించారు. మధ్యప్రదేశ్ను పెట్టుబడి కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో 18 కొత్త పారిశ్రామిక విధానాలను ఆవిష్కరించారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ ఆర్థిక ధోరణులను చర్చించడానికి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, విధాన రూపకర్తలు సమావేశమై గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చర్చించారు.
సమ్మిట్ ఉద్దేశం: సాంకేతికత, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం. తొలి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్2007లో జరిగింది.