
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల టెక్నాలజీలు ఆశ్చర్యపరుస్తున్నాయి. టెక్ కంపెనీలు తమ ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ను ఈ వేదికపై లాంచ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే గ్లోకల్మీ అనే కంపెనీ కూడా తనదైన స్టైల్లో ప్రొడక్ట్ను లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ చూసినవాళ్లంతా అవాక్కవుతున్నారు. ఇంతకీ అదేంటంటారా.. పెంపుడు జంతువుల కోసం ‘పెట్ ఫోన్’ అనే డివైజ్ను ఆవిష్కరించింది.
ఇది క్లౌడ్ సిమ్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. ఇది డస్ట్, వాటర్ ప్రూఫ్. ఈ పెట్ ఫోన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేసేలా డిజైన్ చేశారు. ఇది టూ వే కమ్యూనికేషన్ అందిస్తుంది. దీంతో ఈ డివైజ్ ద్వారా మీ పెట్స్ ఎక్కడున్నా, ఎప్పుడైనా వాటితో టచ్లో ఉండొచ్చు. సిగ్నల్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెట్ ఉన్నా కూడా లొకేషన్ కరెక్ట్గా చూపిస్తుంది. అంతేకాదు మీ పెట్ ఏం చేస్తోందో కూడా ఈ డివైజ్ గుర్తించగలదు. రియల్ టైం లొకేషన్ ట్రాక్ చేయగలదు.
జీపీఎస్, వైఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లతో మీ పెట్ని ట్రాక్ చేయొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. ఈ పెట్ ఫోన్కి ఏఐ టెక్నాలజీ కూడా పనిచేస్తుంది. దీంతో పెంపుడు జంతువు మూడ్ అంచనా వేయొచ్చు. ఉదాహరణకు.. పెట్ చేసే రకరకాల శబ్డాలను గుర్తించి, డివైజ్కు కనెక్ట్ చేసిన వ్యక్తులను అలర్ట్ చేస్తుంది. ఇంకా ‘పా టాక్’ అనే ఫీచర్ ద్వారా మీ పెట్తో డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అది ఎటు వెళ్తుందో తెలుసుకోవచ్చు. సౌండ్ ప్లే ఆప్షన్స్తో పెట్ను ఓదార్చే విధంగా టెక్నాలజీని డిజైన్ చేశారు.