
హైదరాబాద్: 2031 నాటికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించే వారి సంఖ్య ఏటా ఐదు కోట్లు దాటుతుందని దీని నిర్వహణ సంస్థ జీఎంఆర్గ్రూప్ ప్రకటించింది. 2025లో దాదాపు 2.9 కోట్ల మంది ప్రయాణిస్తారని భావిస్తున్నట్టు తెలిపింది. కార్గో టెర్మినల్ విస్తరణకు రూ.370 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని జీహెచ్ఐఏల్ సీఈఓ ప్రదీప్ పాణికర్చెప్పారు.
ఏటా నాలుగు లక్షల టన్నుల సరుకు రవాణా చేసే కొత్త టెర్మినల్ను కూడా నిర్మిస్తామని చెప్పారు. మనదేశంలోని మెట్రో ఎయిర్పోర్టుల్లో అత్యధిక వేగంగా గ్రోత్ సాధిస్తున్నామని, గత ఏడాది 2.5 కోట్ల మందికి సేవలు అందించామని చెప్పారు.
దశల వారీగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ఎయిర్పోర్టులో సదుపాయాలను పెంచుతామని ప్రదీప్ వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్పోర్టును 2008లో 1.2 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో నిర్మించారు. గత క్యాలెండర్సంవత్సరంలో కొత్త ప్రయాణికుల సంఖ్య 36 లక్షలు పెరిగింది.
ప్రస్తుతం రన్వేపై గంటకు 35 వరకు విమానాలు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉందని, దీనిని 42కు పెంచుతామని సీఈఓ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సంలో జీహెచ్ఐఏల్కు రూ.2,700 కోట్ల ఆపరేషనల్ రెవెన్యూ వచ్చిందన్నారు.