
వరంగల్ క్రైం, వెలుగు: మేక తోలుకు రంగు వేసి పులి చర్మం పేరుతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను టాస్క్ఫోర్స్పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన రనావత్ ఉండవార్, ములుగు జిల్లా రామచంద్రాపురానికి చెందిన బిల్లా రాజేశ్ మేక చర్మానికి కలర్లు వేసి పులి చర్మం పేరుతో ఓ వ్యక్తికి రూ.16 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలిసిన టాస్క్ఫోర్స్పోలీసులు హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం మహ్మద్గౌస్పల్లిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.