ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్లో ఉద్రిక్తత

ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. సికింద్రాబాద్లో ఉద్రిక్తత

సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.  గర్భగుడి నుంచి విగ్రహాన్ని బయట విసిరేశారు.  హిందూ సంఘాలు, స్థానికులు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు.  ఈ ఆందోళనలో స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక పాల్గొన్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో   పోలీసులు భారీగా మోహరించారు. నార్త్ జోన్ డీసీపీ సాదాన రష్మి పెరుమాళ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.