స్టోర్ల​ సంఖ్యను 20 వేలకు పెంచుతాం.. ప్రకటించిన గోద్రెజ్​ జెర్సీ

స్టోర్ల​ సంఖ్యను 20 వేలకు పెంచుతాం.. ప్రకటించిన గోద్రెజ్​ జెర్సీ

హైదరాబాద్​, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్​ నెట్​వర్క్​ను ఏడాదిలోపు 20 వేల ఔట్​లెట్లకు పెంచుతామని డెయిరీ కంపెనీ గోద్రెజ్​ జెర్సీ ప్రకటించింది. కొత్త ప్రొడక్టులను డెవలప్ ​చేయడానికి ఆర్​ అండ్ ​డీపై  ఖర్చును 50 శాతం పెంచుతామని, అన్ని ప్రాంతాల్లో బాదమ్​ మిల్క్​, పన్నీర్​ వంటి ప్రొడక్టుల అమ్మకాలను భారీగా పెంచడానికి వ్యూహాలను రూపొందిస్తున్నామని సంస్థ సీఈఓ భూపేంద్ర సూరి వెల్లడించారు.

రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోయే రెండేండ్లలో రూ.వెయ్యి కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జెర్సీ బాదమ్​మిల్క్​ను రూ.100 కోట్ల బ్రాండ్​గా డెవెలప్​ చేస్తాం. మా ప్రొడక్టుల ప్రచారం కోసం నటుడు దగ్గుబాటి రానాను బ్రాండ్ ​అంబాసిడర్​గా నియమించుకున్నాం”అని ఆయన వివరించారు.