హైదరాబాద్‌‌‌‌‌‌ మారథాన్‌: కానిస్టేబుల్​ దంపతులకు గోల్డ్​ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌ మారథాన్‌: కానిస్టేబుల్​ దంపతులకు గోల్డ్​ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఖమ్మం రూరల్, వెలుగు: హైదరాబాద్‎లో ఆదివారం నిర్వహించిన ఎన్‎ఎండీసీ హైదరాబాద్ మారథాన్‎లో ఖమ్మం రూరల్​ మండలం మద్దులపల్లికి చెందిన కానిస్టేబుల్​దంపతులు రేగళ్ల గోపి, బీరెల్లి లక్ష్మి గోల్డ్​మెడల్​సాధించారు. 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో గోపి 4  .17 గంటల్లో, 21.1 కిలోమీటర్ల రేంజ్‎లో లక్ష్మి 2.38 గంటల్లో గమ్యాన్ని చేరుకొని, సత్తా చాటారు. గోపి గన్​మెన్‎గా, లక్ష్మీ తిరుమలాయపాలెం పోలీస్​ స్టేషన్‎లో రిసెప్షనిస్ట్​గా పని చేస్తున్నారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొనగా, గోపి దంపతులు గోల్డ్​మెడల్​సాధించడంతో వారి స్వస్థలమైన మద్దులపల్లి  గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిని రాజకీయ ప్రతినిధులతోపాటు పలువురు అభినందించారు.