ఢిల్లీలో రూ.600 తగ్గిన బంగారం ధర

ఢిల్లీలో రూ.600 తగ్గిన బంగారం ధర
  •  వెండి ధర రూ. 2,800 పతనం 

న్యూఢిల్లీ : దేశీయంగా డిమాండ్ మందగించడంతో దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం బంగారం ధర వరుసగా రెండో రోజు రూ.600 తగ్గి రూ.77,700కి చేరుకుంది.  మంగళవారం 10 గ్రాముల విలువైన పసిడి ధర రూ.78,300 వద్ద ముగిసింది.  ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, గత ముగింపులో కిలో వెండి రూ. 94 వేల నుంచి రూ. 2,800 నుంచి రూ. 91,200కి పడిపోయింది. అయితే, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.77,300కి చేరుకుంది.  దేశీయంగా డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుముఖం పట్టడంతో ధరలు తగ్గుముఖం పతనమయ్యాయని వ్యాపారులు తెలిపారు.

 మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్​) ఫ్యూచర్స్ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, డిసెంబర్ డెలివరీ కోసం బంగారం కాంట్రాక్టులు రూ.29 లేదా 0.04 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.75,190కి చేరాయి.  డిసెంబర్ డెలివరీ కోసం వెండి కాంట్రాక్టులు కూడా ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కిలోకు రూ.754 లేదా 0.85 శాతం పెరిగి రూ.89,483కి చేరుకున్నాయి.  ఆసియా ట్రేడింగ్ అవర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కామెక్స్​ ఫ్యూచర్స్ 0.03 శాతం పడిపోయి ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 2,634.50 డాలర్లకు చేరుకుంది.   అయితే అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెండి ధర 0.75 శాతం పెరిగి ఔన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 30.83 డాలర్లు పలికింది.