
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు దేశరాజధానిలో సోమవారం రూ.1,300 చొప్పున పెరిగాయి. యూఎస్ టారిఫ్లపై అనిశ్చితి కారణంగా పుత్తడికి డిమాండ్ పెరుగుతోంది. గ్లోబల్ఎకానమీలో ఒడిదుడుకుల కారణంగా సెంట్రల్బ్యాంకులు కూడా భారీగా బంగారం కొంటున్నాయి.
99.9 స్వచ్ఛత గల బంగారం ధర రూ.90,750లకు చేరింది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర లైఫ్టైం హై రూ.90,350లకు దూసుకెళ్లింది. కిలో వెండి ధర రూ.1.02 లక్షలకు చేరింది.