
బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్. మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచనలో పడేసేలా పసిడి ధరలు పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ (మార్చి 4, 2025) బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధరపై 760 రూపాయలు పెరిగింది. దీంతో నిన్న (మార్చి 3, 2025) 86,620 రూపాయలు ఉన్న బంగారం ధర ఇవాళ (మార్చి 4, 2025) 87,380 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 700 రూపాయలు పెరిగి 79,400 రూపాయల నుంచి 80,100 రూపాయలకు పెరిగింది.
ఒక్క బంగారం మాత్రమే కాదు వెండి ధరలు కూడా పైపైకి ఎగబాకుతున్నాయి. కిలో వెండి ధర నిన్న(మార్చి 3, 2025) లక్షా 5వేలు ఉండగా, ఇవాళ ఒక్కరోజే 2వేలు పెరిగి లక్షా 7వేలకు చేరింది. పెళ్లిళ్లు ఫిక్స్ చేసుకుని షాపింగ్లో ఉన్న మధ్య తరగతి కుటుంబాలు బంగారం ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల వంటివి అమెరికా వాణిజ్య విధానాలు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ మార్కెట్ కదలికలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ రంగాలలో ఏవైనా ముఖ్యమైన మార్పులు జరిగితే బంగారం ధరలలో మరింత హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు.
Also Read:-చైనాకు వచ్చే అమెరికా సరుకు ఇదే.. వీటిపైనా 15 శాతం పన్ను..
స్టాక్ మార్కెట్లలో గ్లోబల్గా అనిశ్చితి నెలకొనడడంతో ఇన్వెస్టర్లు షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్స్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేసుకుంటున్నారని, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్లో పెడుతున్నారని అనలిస్టులు పేర్కొన్నారు. బంగారం ధరలను ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు, డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి.