బంగారం ధరలు ఆల్​ టైం హై..83వేల మార్క్ దాటేసింది

బంగారం ధరలు ఆల్​ టైం హై..83వేల మార్క్ దాటేసింది
  • రూ.910 పెరిగిన 10 గ్రాముల ధర

న్యూఢిల్లీ: బంగారం ధరలు దేశ రాజధానిలో బుధవారం భారీగా పెరిగి ఆల్​టైం హైకి చేరుకున్నాయి. పది గ్రాముల పుత్తడి ధర రూ.910 పెరిగి రూ. 83,750కి చేరుకుందని ఆలిండియా సరాఫా అసోసియేషన్​ తెలిపింది. 

ఈ నెల ఒకటిన పది గ్రాముల ధర రూ.79,390గా నమోదయింది. మంగళవారం దీని ధర రూ.82,440 ఉంది. కిలో వెండి ధర రూ.వెయ్యి పెరిగి రూ.93 వేలకు చేరింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్​ ట్రేడ్​లో ఫిబ్రవరి డెలివరీ ధర రూ.228 పెరిగి రూ.80,517లకు చేరింది. అమెరికా టెక్​ స్టాక్స్​బాగా నష్టపోతుండటంతో ఇన్వెస్టర్లు బంగారంవైపు మొగ్గుచూపుతున్నారని దేవయా గగ్లానీ అనే ఎనలిస్టు అన్నారు.