
శంషాబాద్, వెలుగు: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఇద్దరు ప్యాసింజర్లు ఆయిల్ టిన్ మూతల మధ్య బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. స్కానింగ్లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 840 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 65 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరిపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.