
నల్లగొండ జిల్లాల్లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని దామరచర్ల మండలం విష్ణుపుంర వద్ద గుంటూరు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో వెళ్లే శబరి ఎక్స్ ప్రెస్ ను మిర్యాలగూడ వద్ద నిలిపివేశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద అధికారులు నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపు తున్నారు.