ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు : గోపీచంద్

ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు : గోపీచంద్

గోపీచంద్, కావ్య థాపర్ జంటగా  శ్రీనువైట్ల దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన చిత్రం ‘విశ్వం’. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ ‘శ్రీనువైట్ల గారితో ఎప్పట్నుంచో వర్క్ చేయాలనుకున్నా. ఈ సినిమాతో కుదిరింది.  ఆయన టైమింగ్ చాలా యూనిక్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఆయనతో జర్నీ చాలా ఎంజాయ్ చేశా.  టీమ్ అందరి హార్డ్ వర్క్‌‌‌‌‌‌‌‌తో అవుట్‌‌‌‌‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ప్రతి సీన్ చేసేటప్పుడు సెట్‌‌‌‌‌‌‌‌లో నవ్వుకుంటూనే ఉన్నాం. 

యాక్షన్, కామెడీ, ఫన్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రార్డినరీగా వచ్చాయి. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. థియేటర్లో కూర్చున్న  ప్రతి ఒక్కరికీ నవ్వు ఆగదు’ అని చెప్పాడు.  ఈ మూవీ తనకు చాలా స్పెషల్ అని కావ్య థాపర్ చెప్పింది.  శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘ఇదొక బ్యూటిఫుల్ జర్నీ.  టెక్నీషియన్స్, యాక్టర్స్  అంతా నా మీద ఇష్టంతో పని చేశారు.  దీంతో  అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను.  ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా  ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేస్తుంది. 

రెండున్నర గంటల్లో ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టదు. దసరాకి అందరూ ఎంజాయ్‌‌‌‌‌‌‌‌ చేసేలా ఉంటుంది’ అని అన్నాడు. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ అని నిర్మాతలు అన్నారు. దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, మహేష్, రైటర్ బీవీఎస్ రవి ఈ కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. టీమ్ అంతా పాల్గొన్నారు.