
GST on UPI: దేశంలో డీమానిటైజేషన్ తర్వాత ప్రజలకు యూపీఐ సేవలను ఫిన్ టెక్ కంపెనీలు చేరువ చేశాయి. ఈ క్రమంలో మారుమూల పల్లెలకు సైతం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వ్యాప్తి చెందింది. ఇదంతా సాధ్యం కావటానికి ఒక్కటే కారణం యూపీఐ చెల్లింపుల మీద ఎలాంటి ఛార్జీలు, అదనపు ఖర్చులు లేకపోవటమే. ఎందుకంటే భౌతికంగా డబ్బు వాడినప్పుడు కూడా ప్రజలకు ఇదే వెసులుబాటు ఉండేది కాబట్టి.
అయితే త్వరలోనే భారత ప్రభుత్వం రూ.2వేలు పైబడి చేసే ట్రాన్సాక్షన్లకు 18 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేయాలని ప్రపోజల్ ఉంది. ప్రజల జీవితంలో యూపీఐ వినియోగం సాధారణ చర్యగా మారిపోయిన తరుణంలో పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు దీనిని ఒక పెద్ద మార్గంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందనే వార్తలు వస్తున్నాయి. చాలా మంది ప్రజలు దీనిపై ఆగ్రహంగా ఉండగా.. ఇది అమలులోకి వస్తే సాధారణ వినియోగదారుల నుంచి చిన్న వ్యాపారుల వరకు అందరిపై అదనపు భారాన్ని కలిగిస్తుందనే ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
Also Read:-మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కొత్త ప్లాన్.. రెండేళ్లలో తలకిందులైన యవ్వారం..
పరిశీలనలో ఉన్న ప్రపోజల్ ప్రకారం ఏకకాలంలో రూ.2వేల కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్స్ మీద 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం వసూలు చేయాలని ప్లాన్ చేసుతున్నట్లు సమాచారం. ఈ చర్యతో డిజిటల్ చెల్లింపులను మరింతగా నియంత్రిత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలని ప్రభుత్వం చూడటమే. ఒకవేళ ఇదే అమలులోకి వస్తే ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ నుంచి తప్పుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దీనిని ప్రభుత్వం, ఫిన్ టెక్ కంపెనీలు ఉచితంగా అందుబాటులో ఉన్న యూజర్ ఫ్రెండ్లీ సేవలుగా చూపటంతో సాధించిన సక్సెస్ తలకిందులు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధానంగా జీఎస్టీ రేటు ప్రకటిస్తే చిన్న వ్యాపారవేత్తలు ప్రభావితం కావొచ్చని తెలుస్తోంది. వారు వ్యాపారంలో వచ్చే పెద్ద చెల్లింపు ట్రాన్సాక్షన్ల కారణంగా జీఎస్టీ కింద నమోదు కావాల్సి రావొచ్చని తెలుస్తోంది. ఇది వారికి జీఎస్టీ కంప్లయన్స్ విషయంలో ఖర్చులను పెంచుతూ కొత్త భారాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది చిన్న వ్యాపారులు అస్సలు సాధ్యం కాని అంశం. అందువల్ల వారు డిజిటల్ చెల్లింపులను తిరస్కరించవచ్చని తెలుస్తోంది.
ALSO READ | Bengaluru: బెంగళూరు బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. నెటిజన్స్ పంచుకున్న లిస్ట్..
ఇప్పటికే మార్కెట్లో చాలా మంది చిన్న వ్యాపారులు క్రెడిట్ కార్డు చెల్లింపుల సమయంలో తమపై పడే 1 నుంచి 2 శాతం ఛార్జీలను తమ కస్టమర్ల వద్ద నుంచే వసూలు చేస్తున్నారు. దీనినే మర్చంట్ డిస్కౌంట్ రేటుగా పిలుస్తుంటారు. వాస్తవానికి వీటిని కొనుగోలుదారుల నుంచి వసూలు చేయకూడదు. వీటిని వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. అందుకే చిన్న వ్యాపారుల వద్ద ప్రజలు క్రెడిట్ కార్డులను ఎక్కువగా వినియోగించటానికి ఇష్టపడరు. ప్రస్తుతం ప్రపోజల్ లో ఉన్న జీఎస్టీ రేటు యూపీఐ చెల్లింపుల మీద నిజంగానే అమలు చేస్తే చిన్న వ్యాపారులు చేసేది లేక పైన మార్గాన్నే ఎంచుకునే ప్రమాదం ఉంది. ఇది మార్కెట్లో డిజిటల్ చెల్లింపులను ప్రవేశపెట్టిన కేంద్ర లక్ష్యాలను కొంత కాలంలోనే దెబ్బతీసే ప్రమాదం ఉండటంతో పాటు భౌతిక కరెన్సీ నోట్లకు డిమాండ్ భారీగా పెరగవచ్చని తెలుస్తోంది. ఇది రిజర్వు బ్యాంకుపై అదనపు భారాన్ని కలిగిస్తుంది.