కాంగ్రెస్ పేదల ప్రభుత్వం

 కాంగ్రెస్ పేదల ప్రభుత్వం
  • ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ
  • జిల్లా కేంద్రం, భిక్కనూరు మండల కేంద్రంలో సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల అందజేత

కామారెడ్డి, వెలుగు : ‘కాంగ్రెస్​ పేదల ప్రభుత్వం..  వారికి నిరంతరం అండగా ఉంటాం..’ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో 24 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందించి మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు అదనంగా పనులు చేస్తున్నామన్నారు.  కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్​ శ్రీనివాస్​రావు, జిల్లా లైబ్రరీ చైర్మన్​ మద్ది చంద్రకాంత్​రెడ్డి,   లీడర్లు  ఇంద్రకరణ్​రెడ్డి, అశోక్​రెడ్డి, పండ్ల రాజు, పున్న రాజేశ్వర్, భీమ్​రెడ్డి, గోనె శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు. 

భిక్కనూరు మండల కేంద్రంలో..

భిక్కనూరు : మండల కేంద్రంలో శనివారం సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యం బారిన పడినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.  కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు భీమ్​రెడ్డి, గ్రంధాలయ సంస్ధ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్​ రెడ్డి, టౌన్​ప్రెసిడెంట్ అందె దయాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గంగల భూమయ్య, బద్దం ఇంద్రకరణ్​రెడ్డిలు పాల్గొన్నారు.