సీఎన్జీ ధరల పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కేంద్రం

సీఎన్జీ ధరల పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ధరలను కేంద్రం పెంచింది. కిలోకు రూ.1చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.74.09 నుంచి రూ.75.09కి పెరిగింది. ఈ ధరలు జూన్ 22 నుంచి అమల్లోకి వస్తాయి.

ధరల పెంపుతో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ లో సీఎన్జీ ధర రూ.78.7 నుంచి రూ.79.7కి చేరుకుంది. యూపీలోని మీరట్, ముజఫర్ నగర్, షామ్లీలో కిలో రూ.79.08 నుంచి 80.08కి పెరిగింది. రాజస్థాన్ లోని అజ్మీర్, పాలి, రాజ్ సమంద్​లో కిలో సీఎన్జీ ధర రూ.81.94 నుంచి 82.94కి చేరుకుంది. సీఎన్జీ ధర పెరగడంతో ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, వ్యక్తిగత వాహనాలు నడిపే వారిపై భారం పడనుంది.