SLBC ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బీజేపీ ఎల్పీ

SLBC ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బీజేపీ ఎల్పీ

ఎస్ఎల్​బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్​బీసీ ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, సీఎందేనని నిర్మల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్​రెడ్డి, పాయల్ శంకర్​పేర్కొన్నారు. టన్నెల్​ లోపల చిక్కుకుపోయిన 8 మంది సురక్షితంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు ఎస్ఎల్​బీసీ టన్నెల్ ను​సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటన జరిగిన విషయం తెలియగానే  ప్రధాని మోదీ సీఎంతో మాట్లాడి అన్నిరకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు.

టన్నెల్​పనులు చేస్తున్న జేపీ కంపెనీకి డబ్బులు మిగిల్చే కుట్ర జరిగిందని ఆరోపించారు. ఏండ్ల తరువాత పనులు ప్రారంభించేపుడు టన్నెల్​ లోపలి పరిస్థితిపై నిపుణులతో అధ్యయనం చేయించకపోవడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమన్నారు. సీఎం ఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం బాధాకరమని, మంత్రులు పిక్​నిక్​కు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోవడం బాగా లేదన్నారు.

 ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నాలుగు ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు రాకేశ్ రెడ్డి, హరీశ్​ కుమార్ బాబు, ధన్​పాల్​  సత్యనారాయణ గుప్తా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిరెడ్డి మనోహర్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు ఉన్నారు.