
హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్(నందికొండ) మున్సిపాలిటీలోని వాటర్ ట్యాంకులోపడి 30 కోతులు మృతి చెందిన ఘటనలో పోలీసులు ..పలువురు అధికారులపై కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ఏఈ భిక్షమయ్య, సిబ్బంది వెంకటేశ్వర్లు, నర్సింహాపై జయపురి సౌత్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 269 కింద కేసు రిజిష్టర్ చేశారు.