జూబ్లీహిల్స్​లో రూ.కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

జూబ్లీహిల్స్​లో రూ.కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్​లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్​పేట మండలం సర్వే నంబరు 403/పిలో జీహెచ్ఎంసీ ట్రీ పార్కును ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ పక్కనే గుంటి శ్రీధర్​రావు అనే వ్యాపారి ఇల్లు ఉంది. కాగా శ్రీధర్​రావు ప్రభుత్వ స్థలంలోని 288 గజాల స్థలాన్ని చదును చేసి షెడ్లు నిర్మించడం స్టార్ట్​చేశాడు.

గుర్తించిన షేక్​పేట తహసీల్దార్ నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. రాజకీయ పలుకుబడి ఉందంటూ అధికారులను బెదిరించాడు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, షేక్​పేట తహసీల్దార్​ అనితారెడ్డి, రెవెన్యూ అధికారులు కలిసి అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణ సామగ్రితోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి శ్రీధర్​రావుతోపాటు కాంట్రాక్టర్​ నర్సింగరావుపైన పోలీసులు కేసు నమోదు చేశారు