
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్మండలంలోని 7 గ్రామాలు సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట, నాయకులగూడెంలను కలుపుతూ ప్రభుత్వం కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏజెన్సీ చిక్కులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక పరిశీలకుడిగా నియమితులైన మున్సిపాలిటీరీజినల్డైరెక్టర్మసూద్గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడారు.
7 పంచాయతీల్లో ఎటువంటి ఏజెన్సీ ఇబ్బందులు లేవని, ఇవి ప్లేన్ఏరియాలని ఆఫీసర్లు తెలిపారు. అనంతరం ఆయన కొత్తగూడెం మున్సిపల్కార్యాలయంలో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల కమిషనర్ సుజాతతోపాటు టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు, సర్వేయర్లతో రివ్యూ నిర్వహించారు. పలు విభాగాలను పరిశీలించారు. ఫైల్స్మూటకట్టి ఉండటం చూసి, ఇంత అప్డేట్టైమ్లో కూడా మూటలు కడితే ఎలా అన్నారు. అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.