లోకాయుక్త, హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం

లోకాయుక్త, హెచ్ఆర్సీ నియామకానికి గవర్నర్ ఆమోదం

హైదరాబాద్, వెలుగు: మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)​, లోకాయుక్త నియామకానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. లోకాయుక్తగా జస్టిస్​ రాజశేఖర్​ రెడ్డి, మానవ హక్కుల కమిషన్​ చైర్మన్​గా జస్టిస్ షమీమ్ అక్తర్‌‌ను నియమించారు. ఈ మేరకు గవర్నర్​ నుంచి ఫైల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. హెచ్ఆర్సీ సభ్యులుగా రమాదేవి, కిషోర్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు బుధవారం లేదంటే గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.  జస్టిస్ రాజశేఖర్​రెడ్డి ప్రస్తుతం రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్​గా బాధ్యతల్లో ఉన్నారు. షమీమ్ అక్తర్ ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్​గా వ్యవహరించారు.