ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ

ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ

హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.గ్రామాల్లో పట్టణాల్లో వాడవాడలా గణేషులు ప్రతిమలు ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. హైదరా బాద్ సిటీలో కూడా గణేష్ నవరాత్రుల కోలాహాలం మొదలైంది. 

నగరంలో ఫేమస్ గణేషుడు.. ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజలు అందుకున్నారు.. బడా గణపతిని దర్శించుకునేందుకు సిటీ ప్రజలతోపాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివస్తున్నారు. శనివారం (సెప్టెంబర్ 7, 2024) తెలంగాణ గవర్నర్ జుష్ణుదేవ్ శర్మ ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకున్నారు. 

గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పూజారులు. గవర్నర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ గణేషుని దర్శంచుకున్నారు.