ప్రధాన ఆర్థిక సలహాదారు పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు

ప్రధాన ఆర్థిక సలహాదారు పదవీ కాలం మరో రెండేళ్లు పొడిగింపు

న్యూఢిల్లీ: ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్​ పదవీకాలాన్ని మరో రెండేళ్లు.. అంటే 2027 మార్చి వరకు పెంచడానికి ప్రధాని మోదీ నాయకత్వంలోని కేబినెట్ ​అపాయింట్స్​ కమిటీ అంగీకరించింది. నాగేశ్వరన్​ 2022 జనవరి 28న సీఈఏగా బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం, బడ్జెట్​ ముందురోజు ప్రవేశపెట్టే ఎకనమిక్​ సర్వేను తయారు చేయడం సీఈఏ ఆఫీసు బాధ్యత. ఇది వరకు క్రెడిట్​స్విస్ ​ గ్రూప్​ ఏజీ, జూలియస్​బేయర్ ​గ్రూపులో పనిచేసిన ఈయన వీకే సుబ్రమణియన్​ తరువాత సీఈఏగా బాధ్యతలు చేపట్టారు.